దేశంలో అత్యధిక నీటినిల్వ సామర్థ్యం గల జలాశయాలున్న నదుల్లో కృష్ణా నది అగ్రగామిగా నిలిచింది. దేశంలోని అన్ని నదీపరివాహక ప్రాంతాల్లో(బేసిన్లలో) నిర్మాణం పూర్తయిన జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు. ఇందులో 1,788.99 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లతో కృష్ణా నది ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక 1,718.91 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లతో గంగా నది రెండో స్థానంలో ఉంది.