దేశంలోని అతి పెద్ద పురాతన, చారిత్రక విశిష్టత గల మసీదుల్లో హైదరాబాద్ మక్కా మసీదు ఒకటి. ఈ మసీదు నిర్మాణానికి 1617లో శంకుస్థాపన జరిగింది. కులీ కుతుబ్షా రాజు, సుల్తాన్ మహ్మద్ కుతుబ్షాలు శంకుస్థాపన చేశారు. కాగా ఔరంగజేబు ఈ మసీదును ప్రారంభించారు. ఈ బృహత్తర మసీదు నిర్మాణం 77 ఏళ్లు కొనసాగింది. మక్కా మసీదు నిర్మాణంలో ఎక్కడా మట్టి వాడలేదట. రాళ్లూ-రాతి పొడిని మాత్రమే ఉపయోగించారు. అతిపెద్ద బండరాళ్లతో మసీదు నిర్మాణం చేపట్టారు.