టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకమూ ఆపమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. టీడీపీ సూపర్ సిక్స్, మోడీ హామీలు చూసి జగన్ను నిద్ర పట్టడం లేదన్నారు. అన్నమయ్య జిల్లా అంగళ్లులో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల మెడకు ఉరితాడన్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఎర్రచందనం, మైనింగ్, ఇసుక మాఫియా నడుస్తోందన్నారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచేశారన్నారు.