జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన పెనుగంచిప్రోలులో శనివారం రాత్రి ఇరు వర్గాలకు చెందిన యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఉపయోగించిన కత్తిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. పెనుగంచిప్రోలులో శనివారం రాత్రి జరిగిన ఘర్షణలో నలుగురు యువకులు తీవ్ర గాయాలు పాలైన విషయం తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన అదనపు పోలీసు బలగాలను పంపించారు.