నందిగామ పట్టణంలోనే పలుచోట్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కు సంబంధించిన శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అదేవిధంగా నవరత్నాల పథకాలకు సంబంధించిన శిలాఫలకాలను, డిజిటల్ లైట్లను సైతం ధ్వంసం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు.