మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల మరణానికి జగనే కారణమని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆరోపించారు. ఆదివారం నందిగామలోని ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ తాడేపల్లిలో జగన్ తన సొంత ఇంటి కోసం నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటిని సీఎం క్యాంప్ కార్యాలయంగా మార్చుకుని, దీని కోసం సుమారు రూ. కోట్ల ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. జగన్ ఇంట్లోని ఫర్నీచర్ విలువైన వస్తువులను ప్రభుత్వానికి లెక్కచెప్పి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు.