నందిగామ పట్టణంలోని అశోక్ నగర్ ఈద్గా వద్ద సోమవారం ఈద్ అల్ అదా పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాజీ శాసనసభ్యులు డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలిపారు.