ముస్లిం మైనారిటీలకు తెదేపా జనసేన వరాల జల్లు

56చూసినవారు
ముస్లిం మైనారిటీలకు తెదేపా జనసేన వరాల జల్లు
ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం తెలుగుదేశం, జనసేన మ్యానిఫెస్టోలో పొందుపరచిన హామీలు అద్భుతంగా ఉన్నాయని ఆయా పార్టీల ముస్లిం నాయకులు అన్నారు. గంపలగూడెం మండలంలోని ఊటుకూరులో గురువారం ఇంటింటా పర్యటించి ప్రచారం నిర్వహించారు. 50 ఏళ్లకే పెన్షన్ వస్తుందని, ఈద్గాలకు స్థలాలు కేటాయించడం, విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మించడం, నూర్ బాషా కార్పొరేషన్ కు ఏటా 100 కోట్లు కేటాయించడం, దుల్హన్ పథకానికి కొనసాగింపుగా లక్ష రూపాయలు అందజేయడం జరుగుతుందని అన్నారు.

విదేశీ విద్యా పథకం కొనసాగింపు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఇమామ్ మౌజ్జన్ లకు 10వేలు, 5వేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. అర్హత ఉన్న ఇమామ్ లకు ప్రభుత్వ ఖాజీలుగా నియమించడం, మసీదుల నిర్వహణ కోసం ప్రతి నెల 5వేల రూపాయలు ఆర్థిక సాయం, హజ్ యాత్రకు వెళ్ళే ఒకొక్క ముస్లింకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు వివరించారు.ముస్లింలకు అన్ని రకాలుగా అండగా నిలిచేది తెదేపా, జనసేన పార్టీలే అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్