లంబోదరుడిని దర్శించుకున్న సీఐ

58చూసినవారు
లంబోదరుడిని దర్శించుకున్న సీఐ
లంబోదరుడిని దర్శించుకున్నారు పటమట సీఐ పవన్ కిషోర్. 11వ డివిజన్ వివేకానంద కాలనీలో యువజన చైతన్య వేదిక సభ్యులు ఏర్పాటు చేసిన వినాయకుని ప్రతిమను దర్శించుకున్నారు. యువజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బెజవాడ నజీర్, కాలనీ అధ్యక్షులు తాంగేళ్లమూడి వీర రాఘవయ్య సీఐకి శాలువాతో సత్కరించారు. కులమతాలకు అతీతంగా పన్నెండు సంవత్సరాల నుండి ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని సిఐ పవన్ కిషోర్ అన్నారు.

సంబంధిత పోస్ట్