బాధితులకు ఆహారం పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బాధితుల కోసం పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) గత తొమ్మిది రోజులుగా ఆహారాన్ని అందిస్తున్నారు. చిట్టినగర్ లోని కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో వంటశాలని ఏర్పాటు చేసి ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని బాధితుల వద్దకు వెళ్లి అందిస్తున్నారు. తొమ్మిదవ రోజు మంగళవారం కూడా బాధితుల కోసం ఆహారాన్ని సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నారు.