ఏపీలో ఎన్నికల వేళ కడప
రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పులివెందుల అసెంబ్లీ స్థానానికి సీఎం
జగన్ పోటీలో ఉండగా, కడప
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల బరిలో నిలిచారు. వీరిద్దరిలో విజయమ్మ మద్దతు ఎవరికి ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. ఆమె ఎవరి తరపునైనా ప్రచారం చేస్తారా? లేదా సైలెంట్ గా ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది. అన్నాచెల్లెళ్లు ఈసారి వేర్వేరు పార్టీల తరపున బరిలో ఉన్నారు.