విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 19 నుంచి 27 వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 22న శ్రీ దుర్గా మల్లేశ్వర దివ్య కల్యాణమహోత్సవాన్ని నిర్వహించనున్నారు. 19న వెండి పల్లకీ సేవ, 20న రావణ వాహన సేవ, 21న వెండి రథోత్సవం, 22న నంది వాహన సేవ, 23న సింహ వాహన సేవ, 24న ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి, సాయంత్రం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్లకు పవిత్ర క్రుష్ణానదిలో తెప్పోత్సవం జరగనుంది.