సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులోని ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో బుధవారం పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కంపెనీకి పక్కన ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ సైతం పూర్తిస్థాయిలో దగ్ధమైందని.. ఆ ఫ్యాక్టరీకి సైతం రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉండొచ్చని తెలుస్తోంది. కాగా ఘటనాస్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.