విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ డ్రగ్స్ కేసులో మా కుటుంబానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయాన్ని కూడా తనఖా పెట్టిన పరిస్థితి ఏపీలో నెలకొందని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి గెలుపు చారిత్రక అవసరమని తెలిపారు. రాజమహేంద్రవరం వేదికగా గురువారం జరిగిన బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఆమె ఈ మేరకు మాట్లాడారు.