ఉత్తరాఖండ్లో ఇద్దరు దుండగులు ఘాతుకానికి తెగబడ్డారు. ఉదమ్ సింగ్ నగర్లోని నానక్మట్టా సాహిబ్ గురుద్వారా ఆవరణలో డేరా కరసేవ చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఇవాళ ఉదయం 6:30 గంటల సమయంలో గురుద్వారా ప్రాంగణంలో కుర్చీపై కూర్చుని ఉండగా తర్సేమ్ సింగ్పై కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి.