కూటమి ప్రకటించిన రూ. లక్షన్నర కోట్ల ఉపప్రణాళిక, ప్రత్యేక డిక్లరేషన్ తో రాష్ట్రంలో బీసీల జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయని, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని మురికిపూడిలో గురువారం నిర్వహించిన జయహో బీసీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. కూటమి తరఫున ప్రకటించిన ఉపప్రణాళికతో పాటు ప్రత్యేక డిక్లరేషన్ తో బీసీలకు అనేక విధాలుగా మేలు జరగనుందని తెలిపారు.