చవితి ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి: సీఐ

82చూసినవారు
వినాయక చవితి పందిళ్లు ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పిడుగురాళ్ల సిఐ వెంకట్రావు తెలిపారు. వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసుకునేందుకు ఐదుగురితో కమిటీగా ఏర్పడి, వారి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్ లో తెలియపరచాలని మంగళవారం కోరారు. నిర్వాహకులు గుర్తింపు కార్డులు అందజేయాలన్నారు. మండపాలు దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విగ్రహం ఎత్తు తదితర వివరాలు తెలపాలన్నారు.

సంబంధిత పోస్ట్