దాచేపల్లి రైల్ లో చోరీ

60చూసినవారు
దాచేపల్లి మండలం నడికుడి రైల్వే స్టేషన్ లో కదులుతున్న రైల్లో మరోసారి చోరీ జరిగింది. వివరాల్లోకెళ్తే శుక్రవారం తెల్లవారుజామున చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్ర్పెస్ లో నడికుడి జంక్షన్ దాటిన తర్వాత కొంత మంది దుండగులు నడికుడి-పొందుగుల మధ్య రైలు చైన్ లాగి రైల్లో ప్రయాణిస్తున్న మహిళల మెడలో గల బంగారు వస్తువులను అపహరించారు. 40 గ్రాముల బంగారం, నగదు అపహరణకు గురైంది. రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్