నాటి విజయవాడ సీపీ, డీసీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ నాపై తప్పుడు కేసు పెట్టి వేధించారు: నటి జత్వానీ

69చూసినవారు
నాటి విజయవాడ సీపీ, డీసీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ నాపై తప్పుడు కేసు పెట్టి వేధించారు: నటి జత్వానీ
వైసీపీ నేత, పోలీసు అధికారుల నుంచి వేధింపులు వ్యవహారంలో ముంబయి సినీ నటి కాదంబరి జత్వానీ విజయవాడలో ఏసీపీ స్రవంతి రాయ్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు మేరకు నాటి సీపీ కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు తనపై కేసు పెట్టి వేధించారని ఆమె తెలిపారు. "వైసీపీ నేత విద్యాసాగర్ నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు” అని ఆమె చెప్పారు.

సంబంధిత పోస్ట్