గొడవలో పెట్రోలు బాంబులు వాడలేదు: సీఐ

68చూసినవారు
కారంపూడి మండల గ్రామ శివారులోని మదీనా గార్డెన్ రెస్టారెంట్లో బుధవారం రాత్రి జరిగిన గొడవలో పెట్రోలు బాంబులు వాడలేదని సీఐ తెలిపారు. గురువారం పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పాత గొడవల కారణంగా కొంత మంది వ్యక్తులు రెస్టారెంట్ వద్దకు వెళ్లి కొంత సామగ్రిని ధ్వంసం చేశారన్నారు. బాధితుడు 100కు ఫోన్ చేయడంతో ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని బాధ్యులను అదుపులోకి తీసుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్