రామభద్రపురంలో డ్రైవర్ల మధ్య ఘర్షణ.. నిలిచిన ట్రాఫిక్

54చూసినవారు
రామభద్రపురంలో డ్రైవర్ల మధ్య ఘర్షణ.. నిలిచిన ట్రాఫిక్
రామభద్రపురంలో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్ల మధ్య సోమవారం మధ్యాహ్నం ఘర్షణ జరిగింది. ఇరు డ్రైవర్‌ల మధ్య వివాదం తలెత్తడంతో ప్రధాన రహదారిలో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ క్రమంలో ఇరువురు డ్రైవర్లు తప్పు నీది అంటే నీది అంటూ వాహనాలను తీయకుండా రోడ్డు మీదనే ఉంచి భూతుల దాడి చేసుకున్నారు. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో స్థానికులు ఇరువురిని మందలించి వాహనాలు తీయించారు.

సంబంధిత పోస్ట్