మెంటాడ మండలంలోని కిండ గూడెం గిరిజన గ్రామాన్ని ఆండ్ర ఎస్ఐ సీతారాం సందర్శించి ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ప్రభుత్వం గిరిజన గ్రామాలకు అందిస్తున్న పథకాలు సౌకర్యాలు వివరించారు. నాటుసారా తయారీ, వినియోగం వలన కలిగే ప్రభావాలు తెలియజేశారు. పిల్లల విద్యను ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం దుప్పట్లు పంపిణీ చేశారు.