ఆంధ్రా – ఒడిశా సరిహద్దు గ్రామాలకు చేరుకున్న ఏనుగుల గుంపు

80చూసినవారు
పార్వతీపురం మండలంలోని ఆంధ్రా – ఒడిశా సరిహద్దు గ్రామాలకు చేరుకున్న ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడి చేసి రైతులకు తీవ్రమైన పంట నష్టాన్ని కలగజేస్తున్నాయి. అర్ద రాత్రి రావికోన పంచాయితీ రంగాలగూడ తోటల్లో తలదాచుకున్న ఏనుగుల మంద శుక్రవారం నాటికి సంఘంవలస పంచాయతీ సీతంపేట మీదుగా తానవలస సమీపాన తిష్ట చేశాయి. పలు గిరిజన గ్రామాలకు చెందిన గిరిజనులు సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న పంటలను సర్వనాశనం చేశాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్