జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెట్టి తనుజా రాణి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసారు. అరకు పార్లమెంటు పరిధిలో గల వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు, ముఖ్య నాయకులను ఆమె కలిస్తున్నారు. దానిలో భాగంగా కురుపాం ఎమ్మెల్యే దంపతులను కలసి ఎంపీ అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలని కోరారు.