పోస్టల్ బ్యాలెట్ కోసం అందజేసే ఫారం 12 డీని బిఎల్ఓ ద్వారా సేకరించాలని టీడీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు ఆదివారం కురుపాం నియోజకవర్గ తహశీల్దార్ ను కలిసిన టీడీపీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. కొన్ని గ్రామాలలో వాలంటీర్లు సీనియర్ సిటిజన్స్, వికలాంగ ఓటర్ల వద్దకు వెళ్లి ఫారం 12డీ లను సేకరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తక్షణమే వారిపై చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు.