అక్రమంగా తరలిస్తున్న టేకు కలప ను అటవీశాఖ అధికారులు శుక్రవారం కురుపాం మండలం మొండెంఖల్ గ్రామ సమీపంలో పట్టుకున్నారు. కొండవాడ నుండి పాలకొండ కి టేకు కలప తరలిస్తున్నారని, కేసు నమోదు చేసి వాహనాన్ని , కలపను స్వాధీనం చేసుకొని కార్యాలయానికి తరలించామన్నారు. కలప విలువ సుమారు 35 వేలు వరకు ఉంటుందని ఫారెస్ట్ అధికారి సూర్య తెలిపారు.