కొమరాడ మండలంలో ఏజెన్సీ ప్రాంతాలైన మసిమండ, పెద్ద శాఖ, పూడేసు గిరిజన గ్రామాల్లో ఇంతవరకు నారుమల్లు వేసే పరిస్థితి లేదు. అడపాదడప వర్షాలు పడిన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న గెడ్డలలో నీటి చుక్క కూడా లేదు. అందువలన రైతులు నారుమళ్లు వేసే పరిస్థితి కూడా లేదు. ఈ సంవత్సరం పంటలు పండుతాయో లేదో అని ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం ఏదైనా సహాయం చేసి వారిని ఆదుకోవాలని మంగళవారం రైతులు కోరారు.