కొండచరియలు విరిగిపడి.. రాకపోకలకు అంతరాయం

54చూసినవారు
మన్యం జిల్లా, కురుపాం మండలం కోటకొండ గ్రామ సమీపంలో గల ఘాట్ రోడ్డు వద్ద కొండచరియలు విరిగిపడి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం కురిసిన వర్షానికి కొండపై నుండి బండరాళ్లు దొర్లుకుంటు రహదారికి అడ్డంగా పడుతుండడంతో గ్రామస్తులు, వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి కొండచరియలను తొలిగించాలని, రోడ్డుకు ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్