పోక్సో కేసులో నిందితుడికి 20సం. కఠిన కారాగార శిక్ష

84చూసినవారు
పోక్సో కేసులో నిందితుడికి 20సం. కఠిన కారాగార శిక్ష
విజయనగరం జిల్లా మహిళా పోలీసు స్టేషనులో 2023 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితునికి 20 సం. ల కఠిన కారాగార శిక్ష,
రూ. 7000ల జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కే. నాగమణి తీర్పు వెల్లడించినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దతాడివాడ గ్రామానికి చెందిన కలిశెట్టి ఉమా మహేశ్వరరావు అనే వ్యక్తి మైనరు బాలికపై అత్యాచారంకు పాల్పడినట్లు నేరం రుజువైందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్