అదుపుతప్పి పొలాల్లోకి వెళ్లిన ఆర్టీసి బస్సు

5754చూసినవారు
భామిని మండలం బాలేరు సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి ఆదివారం దూసుకెళ్లింది. బత్తిలి నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా.. ఎండ తీవ్రతకు డ్రైవరు కళ్లు తిరిగాయి. ఈ క్రమంలో బస్సును రోడ్డు పక్కన నిలిపేందుకు ప్రయత్నించగా అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిందని డ్రైవర్ కే. బారికి తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్