సీజనల్ వ్యాదులు ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: డిఎంఓ

53చూసినవారు
సీజనల్ వ్యాదులు ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: డిఎంఓ
సీజనల్ వ్యాదులు ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి డా టి. జగన్మోహన్ రావు ఆదేశించారు. కూనేరు రామభద్రపురం పిహెచ్సి లో నిర్వహించిన ఆశ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. మలేరియా, డెంగ్యూ, డయేరియా తదితర సీజనల్ వ్యాదులు గ్రామాల్లో ప్రబలకుండా క్షేత్ర స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉంటూ అవసరమైన పరీక్షలు, మందులు సిద్ధంగా ఉంచాలన్నారు.

సంబంధిత పోస్ట్