పాఠశాలలో ఆయాలను తొలగిస్తే సహించేది లేదు

55చూసినవారు
గజపతినగరం హైస్కూల్లో పనిచేస్తున్న ఆయాలను తొలగిస్తే సహించేది లేదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి లక్ష్మి హెచ్చరించారు. సోమవారం పాఠశాల వద్ద ఆయాలతో కలిసి ఆమె నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలు చాలీచాలని జీతంతో కుటుంబాలను నెట్టికొస్తున్నారని అన్నారు. ఆయాలను తొలగించే యోచనలో ఉంటే భవిష్యత్తులో పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె అన్నారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఆయాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్