కొత్తవలస మండలం దెందేరుకు చెందిన నారపు రెడ్డి రాము తన మేనమామకు చెందిన స్కూటీ కనిపించడం లేదని గురువారం కొత్తవలస పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే స్కూటీపై తాను పండగకు వెళ్లి వచ్చి తన ఇంటి ముందు స్కూటీని ఉంచినట్లు తెలిపారు. గురువారం ఉదయం చూసేసరికి స్కూటీ లేకపోవడంతో సమీప ప్రజలను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.