కొత్తవలస: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక

67చూసినవారు
కొత్తవలస: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక
కొత్తవలస మండలంలో మంగళ పాలెం వద్ద ఉన్న సెయింట్ ఆన్స్ పాఠశాలకి చెందిన మేడిశెట్టీ రాజేష్ అండర్- 17 విభాగంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక అయ్యారు. పాఠశాల నుంచి మేడిశెట్టి రాజేష్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక కావడంపై, పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ కెథరిన్, పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ సుధారాణి రాజేష్ ని, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులైన భూషణ్, వెంకటరావు, జశ్వంత్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్