వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళిన వారు ఎవరూ బాగుపడరు

57చూసినవారు
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్లిన వారు ఎవరూ బాగుపడరని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎస్. కోట మండలం శివరామరాజుపేటలో సోమవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 100 రోజుల ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని దుయ్యబట్టారు. త్వరలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు సౌకర్యం, నెలకు 1500 పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్