శృంగవరపుకోట: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

77చూసినవారు
శృంగవరపుకోట: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
ఎస్. కోట మండలంలో ఆదివారం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా ఎస్. కోట సాయిరాం కాలనీలో రూ. 17 లక్షలు, తిమిడి లో రూ. 15 లక్షలు, వెంకటరమణ పేటలో రూ. 25 లక్షల నిధులతో చేపట్టనున్న సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్