చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటే మీకేం గుర్తుకు వస్తుందని సీఎం జగన్ ప్రజలను అడిగారు. తనకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన మోససాడు గుర్తుకు వస్తాడని అన్నారు. గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు, పవన్ను కలిసి పేదవాడి భవిష్యత్ మీద యుద్ధానికి వస్తున్నారు. ఒకరికి విశ్వసనీయత లేదు. ఒకరికి విలువ లేదు.’ అని ఆరోపించారు.