AP: పిఠాపురం జయకేతనం సభపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి సెటైర్లు వేశారు. ఆ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. 21 సీట్లు గెలుచుకుని 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటూ మాట్లాడుతున్నాడని అన్నారు. 'టీడీపీలో టికెట్ దక్కనివారికి జనసేన టికెట్లిచ్చింది. గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు చంద్రబాబు మనుషులే. జనసేన నిర్వాహణను చూసేది చంద్రబాబే' అని అంబటి షాకింగ్ విషయాలు తెలిపారు.