బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో సమాజానికి జరుగుతున్న సేవ అభినందనీయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ధర్మాన్ని రక్షిస్తే.. అది మనల్ని రక్షిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆత్మప్రబోధానుసారం నడుచుకోవాలని సూచించారు. ఎప్పుడూ బయటి విషయాలే ఆలోచించకుండా మన కోసం సమయం కేటాయించుకోవాలని చెప్పారు. ఏకాగ్రతతో పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్టి తెలిపారు.