మే 1న ఇళ్ల వ‌ద్దే పెన్ష‌న్ పంపిణీ చేయాలి: ప్రత్తిపాటి

83చూసినవారు
మే 1న ఇళ్ల వ‌ద్దే పెన్ష‌న్ పంపిణీ చేయాలి: ప్రత్తిపాటి
పెన్ష‌న్ల పంపిణీపై ఇకనైనా సీఎం జగన్ నీచ రాజకీయాలు మానుకోవాల‌ని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు హిత‌వు ప‌లికారు. "మే 1న ఇంటి వద్దనే లబ్ధిదారులకు పింఛన్‌ పంపిణీ చేయాలి. సచివాలయాలు, పంచాయతీ, రెవెన్యూలో కావాల్సినంత సిబ్బంది ఉన్నారు. ఇప్పటికీ మొండిగా వ్యవహరిస్తోన్న సీఎస్‌ను ఈసీ బదిలీ చేయాలి. పెన్ష‌న్ల విషయంలో జగన్‌ దుర్మార్గాలపై ఈసీకి ఇప్పటికే చెప్పాం." అని ప్రత్తిపాటి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్