టీడీపీకి రాజీనామా చేసిన సీనీయర్ నేత యనమల కృష్ణుడు వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ సమక్షంలో ఇవాళ ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరిక్రిష్ణ, ఎల్.భాస్కర్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ.. టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకు మాత్రమే టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు.