ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. సీఈఓకు ఫిర్యాదు

81చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. సీఈఓకు ఫిర్యాదు
టీడీపీ నాయకుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)కి ఫిర్యాదు చేశారు. ఇంటెలిజెన్స్, పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్