విజయవాడలో నిర్వహించిన పార్టీ వర్క్షాప్లో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపింది. చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఐజీ పంపితేనే వచ్చానని పట్టుబడిన కానిస్టేబుల్ చెప్పాడన్నారు. తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న ఆధారాలు కానిస్టేబుల్ ఫోన్లో లభ్యమయ్యాయని కేశినేని చిన్ని తెలిపారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.