రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో
టీడీపీ,
వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
వైసీపీ నుండి మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి బొత్స మూడు సార్లు ఎన్నికయ్యారు. ఇక
టీడీపీ నుంచి మాజీ మంత్రి కమిడి కళా వెంకట్రావు బరిలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి
రాజకీయాలు నెరపిన కళా తొలిసారి విజయనగరం నుంచి పోటీకి దిగుతున్నారు.