మహారాష్ట్రలోని సాంగ్లీలో అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. తాస్గావ్-మనెరాజురి రహదారిలోని చించని గ్రామ సమీపంలో అర్ధరాత్రి ఆల్టో కారు అదుపుతప్పింది. నీళ్లులేని కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో బాలికను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.