AP: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిన్న పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కడపలోని రహస్య ప్రాంతంలో పోసానిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకాసేపట్లో పోసానిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్కు తీసుకెళ్లనున్నారు. అక్కడ విచారణ జరిపి.. రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.