హైడ్రా భయంతో.. మహిళ ఆత్మహత్య (వీడియో)

63చూసినవారు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి యాదవ బస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ (56) ఇంటి కిటికీ‌ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శివయ్య, బుచ్చమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారికి కట్నంగా తమ ఇల్లు ఇచ్చారు. ఇటీవల MRDA అధికారులు ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. దీంతో తమ బిడ్డలకు ఇచ్చిన ఇల్లు కూల్చేస్తారని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్