గిద్దలూరు: విద్యార్థులకు స్టడీమెటీరియల్స్ పంపిణీ

66చూసినవారు
గిద్దలూరు: విద్యార్థులకు స్టడీమెటీరియల్స్ పంపిణీ
గిద్దలూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పొదిలికొండ పల్లెలో 10వ తరగతి చదువుతున్న 30 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేసారు. హిందీ ఉపాధ్యాయులు, యశ్వంత్ ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవాధ్యక్షులు డాక్టర్ మొర్రి పిచ్చయ్య తన సొంత నిధులు ఖర్చు చేసి శుక్రవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాత డాక్టర్ మొర్రి పిచ్చయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు స్టడీ మెటీరియల్స్ ను సద్వినియోగ పరుచుకొని బాగా చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్