కనిగిరి కాపు నాయకులు డాక్టర్ రామయ్య నాయుడును శనివారం ఆయన నివాస గృహంలో కనిగిరి
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు రానున్న ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కనిగిరి నియోజకవర్గంలో కాపులకు సముచిత స్థానం కల్పిస్తామని ఉగ్ర తెలిపారు.