మట్టి పరీక్షలు చేయించుకోండి

68చూసినవారు
మట్టి పరీక్షలు చేయించుకోండి
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని రైతులు తమ పొలాల్లోని మట్టి నమూనా పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ అదివారం తెలిపారు. 2024-25కు సంబంధించి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, ఉచిత మట్టి పరీక్షలపై గ్రామ వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ప్రతి రైతు మట్టి పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయ అధికారి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్